అంతులేని ‘కధకుడు’

1st Image

.                                                 అంతులేని ‘కధకుడు’

      సినీమా బలహీనత నాటకం, కాని అలనాటి ఫాల్కే ‘హరిశ్చంద్ర’ నుంచి, తొలినాటి పుల్లయ్యగారి ‘భక్త ప్రహ్లాద’ దగ్గర్నుంచి నేటివరకు à°† బలహీనత సామాన్యగుణంగా భారతీయ సీనిమాలో రాజ్యమేలుతూ వచ్చింది.  కాని ఐదు దశాబ్దాలపాటు ‘నాటకీయత’నే సినిమాకి బలమూ, అలంకారమూ, ఆకర్షణా చేసి ` వెండితెరమీద అపూర్వమైన నాటకాలను à°°à°šà°¿à°‚à°šà°¿à°¨ వెండితెర మేస్త్రీ కె. బాలచందర్‌.  76 సంవత్సరాల కిందట తంజావూరు జిల్లా నల్లమాంగుడి అనే గ్రామంలో 8 ఏళ్ల కుర్రాడికి నాటకం ఊపిరి.  ఊరిమధ్య అరుగుమీద నాటకం వేస్తూంటే వాళ్ల నాన్నకి తెలిసి, నాటకం మధ్యలో స్టేజిమీదకి  వచ్చి కొడుకుని చెవిపట్టుకు తీసుకుపోయి ఇంట్లో చావగొట్టుడు. అయితే à°† వ్యసనం కారణంగానే à°† కుర్రాడు తర్వాతి జీవితంలో 9 జాతీయ బహుమతులూ, 13 ఫిలిం ఫేర్‌అవార్డులు, పద్మశ్రీ, దాదా సాహెబ్‌ఫాల్కే అవార్డు, కళైమామణి, ఏ ఎన్నార్‌అవార్డు పుచ్చుకుని భారతదేశంలో కోట్లాదిమంది

అభిమానుల్ని సంపాదించుకుంటాడని ఆయనకి తెలీదు.19 ఏళ్లకి ఆయన ఊళ్లో బడిపంతులయ్యాడు, తర్వాత ఎకౌంటెంట్‌జనరల్‌ఆఫీసులో గుమస్తా ఉద్యోగం, అప్పుడే à°’à°• నాటక సమాజాన్ని ఏర్పరుచుకుని మొట్టమొదటి నాటకం ‘మేజర్‌చంద్రకాంత్‌’ à°°à°šà°¨, ప్రదర్శన,దరిమిలాను సుందరరాజన్‌అనే నటుడు సినీమాలో à°† పాత్ర వేసి ‘మేజర్‌’ ని ఇంటిపేరు చేసుకున్నాడు. à°“ పేరులేని తమిళ దర్శకుడు  ‘ధాయ్‌పిరందాళ్‌వళి పిరుక్కుం’ (‘‘ఆషాడమాసం వస్తేదారి అదే దొరుకుతుంది’’ ) అనే సినీమా తీసి, అనుకోకుండా బోలెడు డబ్బు సంపాదించి, బాలచందర్‌. ‘‘నీర్‌కుమిళి’’ అనే నాటకాన్ని చూసి, దాన్ని సినీమాగా తీయాలకనుకున్నాడు.  బాలచందర్‌నే దర్శకత్వం వహించమన్నాడు.  నాకు చాతకాదని వచ్చేశాడు బాలచందర్‌.  తోటి నటులు తిట్టి అతనికి నమ్మకం లేని వ్యాసంగంలోకి అతన్ని తోశారు. అలా మొదటి సినీమాకి దర్శకుడయారు. నా ‘కళ్లు’ నాటిక మీద ఇండియన్‌ఎక్స్క్‌ప్రెస్‌లో చిన్న సమీక్ష చదివి దర్శకుడు ఎస్‌.à°¡à°¿.లాల్‌ద్వారా నాకు కబురు పంపారు.  నేను à°•à°§ చెప్తే పొంగిపోయి నాటిక హక్కులు కొని చిత్రనిర్మాణానికి ఉపక్రమించారు.  పేరు ‘ఊమై విళిగళ్‌’ (మూగ కళ్లు), జయసుధ, జయశంకర్‌నటీనటులు. తీరానాలుగు రీళ్లు తీశాక నిర్మాణం నిలిచిపోయింది.  సంవత్సరం తర్వాత ఇద్దరం పామ్‌గ్రోవ్‌హొటల్లో కలిశాం.  ‘ ఆపేశారేం సార్‌? ’ అనడిగాను.  ‘నాటికలో మీరు సూచించిన సింబల్‌తెరమీద విస్తృతిలో పల్చబుతోంది. నచ్చక ఆపేశాను’ అన్నారు.  à°’à°• గొప్పు దర్శకుడి కళాత్మకమయిన నిజాయితీకి ఇది నిదర్శనం. మా వాసూ పేరిట స్థాపించిన గొల్లపూడి శ్రీనివాస్‌స్మారిక సంస్థ ప్రారంభోత్సవ సభలో అక్కినేని, సునీల్‌దత్‌, అపర్ణాసేన్‌, అదూర్‌గోపాలకృష్ణన్‌తో పాటు బాలచందర్‌ముఖ్య అతిధి.  మాట్లాడుతూ ‘‘ శ్రీనివాస్‌విశాఖ సముద్ర తీరంలో మృతికి నాచేతులకూ రక్తం అంటిందేమో!  సముద్రాన్ని ఆకర్షణీయంగా అలంకరిచిన నేరంనాది ’’  అంటూ ‘‘ డ్యూయెట్‌’’ సినీమా షూటింగ్‌అక్కడ

మొదలెట్టి వాసూ జ్ఞాపకంతో తీయలేక ఒకరోజు విరమించుకున్నారట. కారణాన్ని మీనాక్షి  శేషాద్రికి చెప్పారట. మరో పదేళ్ల తర్వాత హిందీ హిరో ఆమీర్‌ఖాన్‌బహుమతినందుకుంటున్న సభకి వచ్చి ఆయన సినీమా ‘తారే జమీన్‌పర్‌’ లో కృషిని ప్రశంసిస్తే ఆమీర్‌ఖాన్‌పసివాడిలాగ కంటతడి పెట్టుకున్నాడు. వేదికమీదే బాలచందర్‌చేతిలో ప్రసంగపాఠాన్ని లాక్కొని ‘‘నేను ముసిలివాడినయాక నా మనుమడికి ప్రసంగం చదివి వినిపిస్తాను’’ అంటూ ‘మా అమ్మ à°ˆ సభలో ఉంటే ఎంతో సంతోషించేది’’ అన్నారు. కొందరికి వృత్తి ఉపాధి, కొందరికి ఊపిరి, మరికొందరికి అంతః చేతన.  ఆఖరి రోజుల్లో ఆపస్మారంలో ఉండిపోయారు.  స్పృహలేదు. అయినా మధ్య ఆయన పెదాలు ‘‘లైట్స్‌, కెమెరా, స్టార్ట్‌!’’ అంటున్నాయట! à°“ జీవితకాలం వెండితెరకి నాటకం రుచిని మప్పిన రుషి బాలచందర్‌, కధనీ, పాత్రల్నీ చిక్కగా కాచివడపోసి అందులో పాత్రలయిన ప్రతి నటుడినీ ‘ చరిత్ర’ ను చేసిన సృష్టికర్త, కమల్‌హాసన్‌, రజనీకాంత్‌, సరిత, మమ్ముటి, ప్రకాష్‌రాజ్‌, ఏ.ఆర్‌.రెహెమాన్‌` ఉదాహరణలు చాలు. బాలచందర్‌పొడుపు à°•à°§ నాటకం పెట్టుబడి. వ్యూహం కధనం.  వాటిలో అంతర్భాగమయిన ప్రతి ఒక్కరూ మణిపూసలయారు.  à°’à°• జీవితకాలంలో పట్టిందంతా బంగారం చేసి, తన సంతకాన్ని ప్రతి సృష్టిలోను నిలుపుకున్న, దర్శక నిర్మాత ` మరొక్కరే గుర్తుకొస్తారు నాకు ` ఆల్రె ్ఫడ్‌హిచ్‌కాక్‌, అయితే వారి ధోరణులు వేరు, భాషలు వేరు, ప్రేఖకులు వేరు.  కాని ఇద్దరూ ఆక్రమించుకున్న ఆకాశం ఒక్కటే.

 

                                                                                                                                                       à°°à°šà°¨: గొల్లపూడి మారుతీ రావు గారు